కిడ్నాప్ కేసులో మిస్టరీని ఛేధించిన పోలీసులు

by Disha Web Desk 6 |
కిడ్నాప్ కేసులో మిస్టరీని ఛేధించిన పోలీసులు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ఆఫ్జల్ గంజ్ పోలీసులు మిస్టరీని ఛేధించారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకుని చిన్నారిని కాపాడారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద శ్వేత అనే మహిళ తన రెండు నెలల కూతురుతో ఫుట్ పాత్ పై పడుకోగా ఓ మహిళ, యువకుడు కలిసి పాపను అపంహరించారు. ఈ మేరకు శ్వేత ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు చేసిన ఆఫ్జల్ గంజ్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ సాయంతో దర్యాప్తు చేసారు. నిందితులు పాతబస్తి లోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్టు తెలుసుకొని అరెస్ట్ చేసారు.


Next Story

Most Viewed