- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చివరి నిమిషంలో షాకిచ్చిన పోలీసులు.. బండి సంజయ్ కీలక నిర్ణయం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతుల కోసం దీక్షకు పూనుకున్నారు. మంగళవారం ఉదయం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ‘రైతు దీక్ష’ పేరుతో నిరసన తెలియజేయనున్నారు. ఈ దీక్షలో బండి సంజయ్ సహా పలువురు బీజేపీ కీలక నేతలు పాల్గొంటారని ముందుగానే ప్రకటించారు. అయితే, అనూహ్యంగా చివరి నిమిషంలో పోలీసులు బండి సంజయ్కు షాకిచ్చారు. దీక్షకు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ కారణంగా అనుమతించలేదు. దీంతో బండి సంజయ్ తన ఎంపీ కార్యాలయంలోనే దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ముందుగానే ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లో దీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష జరుగనుంది.
Next Story