పోలీసుల నోటీసులు.. Rajasingh సంచలన వ్యాఖ్యలు!

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-31 06:39:17  IST  )

మతపరమైన వ్యాఖ్యలు చేశారని మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు.

పోలీసుల నోటీసులు.. Rajasingh సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్: ముంబాయిలో జరిగిన బహిరంగ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం ఉదయం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కేసులో బెయిల్‌పై విడుదల సందర్భంగా పలు షరతులు రాజాసింగ్‌పై ఉన్నాయని వాటిని ఆయన ఉల్లంఘించారని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నోటీసుల జారీపై రాజాసింగ్ స్పందించారు.

నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా.. జైలుకు పంపినా భయపడేది లేదన్నారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్ పై చట్టం చేయాలని సభలో తాను కోరానని తెలిపారు. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయని పోలీసులను ప్రశ్నించారు. ముంబై‌లో స్పీచ్ ఇస్తే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేయడం ఏంటని మండి పడ్డారు.

Also Read...

MLA Rajasinghకు మళ్లీ నోటీసులు!

మీరా మాకు నీతులు చెప్పేది..? సీఎం KCRపై Kishan Reddy విమర్శలు

Next Story