- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పోలీసుల నోటీసులు.. Rajasingh సంచలన వ్యాఖ్యలు!
దిశ, వెబ్ డెస్క్: ముంబాయిలో జరిగిన బహిరంగ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం ఉదయం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కేసులో బెయిల్పై విడుదల సందర్భంగా పలు షరతులు రాజాసింగ్పై ఉన్నాయని వాటిని ఆయన ఉల్లంఘించారని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నోటీసుల జారీపై రాజాసింగ్ స్పందించారు.
నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా.. జైలుకు పంపినా భయపడేది లేదన్నారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్ పై చట్టం చేయాలని సభలో తాను కోరానని తెలిపారు. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయని పోలీసులను ప్రశ్నించారు. ముంబైలో స్పీచ్ ఇస్తే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేయడం ఏంటని మండి పడ్డారు.
Also Read...
MLA Rajasinghకు మళ్లీ నోటీసులు!
మీరా మాకు నీతులు చెప్పేది..? సీఎం KCRపై Kishan Reddy విమర్శలు