- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phule statue: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. నెక్లెస్ రోడ్లో ఫూలే విగ్రహం
నెక్లెస్ రోడ్లో ఫూలే విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం (Mahatma Jyotiba Phule Statue) ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి రోజే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ (Necklace Road) ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు ఇవాళ సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్గౌడ్, తదితరులతో కలిసి సీఎం స్థలాన్ని పరిశీలించారు. స్టాచ్యూ స్థలం కోసం సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్లో ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ రూపకల్పన చేయాలని చేయాలని సూచించారు.
ఫూలే విగ్రహానికి పూలమాల వేసి..
ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా అంబర్పేటలో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్చార్జి రోహిన్రెడ్డి, తదితరులలు పాల్గొన్నారు.






