సీఎం నివాసం ముట్టడికి యత్నం.. పీడీఎస్‌యూ కార్యకర్తలు అరెస్టు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-07 06:19:32  IST  )

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయడంతో పాటు, డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పీడీఎస్‌యూ కార్యకర్తలు సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

సీఎం నివాసం ముట్టడికి యత్నం.. పీడీఎస్‌యూ కార్యకర్తలు అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయడంతో పాటు, డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పీడీఎస్‌యూ కార్యకర్తలు సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని, వ్యాన్ లో ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా.. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి.. అక్కడ పలువురు కేంద్రమంత్రుల్ని కలవనున్నారు. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు గురించి కేంద్రమత్రితో చర్చించనున్నారు.

Next Story