- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lagacharla: లగచర్ల కేసులో పట్నం నరేందర్రెడ్డికి రిమాండ్ పొడిగింపు
by Naga Rani Yarlagadda |
లగచర్ల కేసు (Lagacharla Case)లో ఏ1 నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ (Patnam Narendar Reddy Remand) ను కోర్టు పొడిగించింది.

X
దిశ, వెబ్ డెస్క్: లగచర్ల కేసు (Lagacharla Case)లో ఏ1 నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ (Patnam Narendar Reddy Remand) ను కోర్టు పొడిగించింది. నిన్నటితో పట్నం నరేందర్ రిమాండ్ గడువు ముగియగా.. పోలీసులు కొడంగల్ కోర్టు (Kodangal Court)లో హాజరు పరిచారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను డిసెంబర్ 11 వరకూ పొడిగిస్తూ.. జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
నవంబర్ 11న లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణపై రైతుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై అక్కడి రైతులు, ప్రజలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు రాగా.. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Next Story






