లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-16 12:17:04  IST  )

పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తాండూర్ నుంచి వికారాబాద్ కు డీఈని బదిలీ విషయంలో రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్‌లో ఉన్న పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కనకరత్నం గతేడాదే పదవి నుంచి రిటైర్ అవ్వగా.. ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది.

Next Story