- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ORR Toll Charges: నగరవాసులకు బ్యాడ్ న్యూస్.. ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీల పెంపు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రకటించింది.

దిశ, వెబ్డెస్క్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై టోల్ ఛార్జీ (Toll Charges)లను పెంచుతున్నట్లుగా ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ (IRB Infra Limited) ప్రకటించింది. హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(HGCL) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ (ORR)ను బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకున్న విషయం విధితమే. అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతి సంవత్సరం టోల్ఛార్జీలను పెంచుకునే వెసులుబాటును కూడా ఆ సంస్థకు కల్పించింది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road)పై టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కారు, జీపు, లైట్ మోటర్ వెహికల్స్కు కి.మీకు రూ.2.34 నుంచి రూ.2.44కు, ఇక మినీ బస్, ఎల్సీవీలకు కి.మీకు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు. అదేవిధంగా 2 యాక్సిల్ బస్సులకు కి.మీకు రూ.6.69 నుంచి రూ.7కు, హెవీ వెహికిల్స్కు కి.మీ. రూ.15.09 నుంచి రూ.15.78కి ఛార్జీలను పెంచుతూ ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రకటన విడుదల చేశారు.






