NTR : ఎన్టీఆర్‌ జయంతి వేళ బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

by Rajesh |
NTR : ఎన్టీఆర్‌ జయంతి వేళ బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ఓ శక్తి అన్నారు. తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవ్యం అని కొనియాడారు. ప్రభుత్వంలో డేరింగ్ నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికి ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇతర పార్టీలు ఫాలో అవుతున్నాయన్నారు. సినీ రంగంలో అగ్రహీరోగా వెలుగొందుతున్న టైంలోనే పాలిటిక్స్‌లో కి వచ్చారన్నారు. ఒకే పంథాలో సాగుతున్న రాజకీయాలను మార్చారని తెలిపారు. బాలకృష్ణ వెంట నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు ఉన్నారు.



Next Story

Most Viewed