కౌశిక్ రెడ్డికి నోటీసుల అంశంలో ట్విస్ట్.. ఆమె ఫిర్యాదుతోనే NCW యాక్షన్..!

by Disha Web Desk 19 |
కౌశిక్ రెడ్డికి నోటీసుల అంశంలో ట్విస్ట్.. ఆమె ఫిర్యాదుతోనే NCW యాక్షన్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయంలో ఇందిరా శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్‌సీడబ్ల్యూ ఈ కేసును సుమోటోగా స్వీకరించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇందిరా శోభన్ ఖండించారు.

ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోలేదని.. తన ఫిర్యాదుతోనే చర్యలకు మహిళా కమిషన్ ఉపక్రమించిందని సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు తన చేసిన ఫిర్యాదుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్‌ను ఇందిరా శోభన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా కౌశిక్ రెడ్డిని రేపు ఉదయం 11:30 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.



Next Story

Most Viewed