దివ్యాంగురాలితో యువకుడి ప్రేమ, పెళ్లి.. తండ్రి ఎంట్రీతో సీన్ రివర్స్..

by Sumithra |
దివ్యాంగురాలితో యువకుడి ప్రేమ, పెళ్లి.. తండ్రి ఎంట్రీతో సీన్ రివర్స్..
X

దిశ, కామారెడ్డి రూరల్ : ఓ దివ్యాంగురాలికి మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. కొన్ని నెలల పాటు ఇద్దరు కలిసి అన్నోన్యంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు కొడుకును తీసుకొని ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ఆ వికలాంగురాలు ఒంటరి అయి భర్త కోసం పడరాని పాట్లు పడుతుంది. చివరకు భర్త కావాలంటూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో జరిగింది. భిక్కనూరు మండలం పొందుర్తి గ్రామానికి చెందిన రజిత అనే దివ్యాంగురాలికి కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్ రెడ్డితో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది.

6 నెలల క్రితం జశ్వంత్ రెడ్డి, రజితలు వివాహం చేసుకున్నారు. నాలుగు నెలల అనంతరం జశ్వంత్ రెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డి కలుగజేసుకొని అతన్ని రజిత నుంచి వేరు చేశాడు. కొడుకు జశ్వంత్ రెడ్డిని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లి మరో అమ్మాయితో వివాహం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న రజిత న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ చూట్టు తిరిగింది. ఎవరు స్పందించక పోవడంతో తన భర్త గ్రామమైన నరసన్నపల్లిలోని ఇంటి ఎదుట రజిత ఆందోళనకు దిగింది. తన భర్తను తనకు అప్పగించాలని అత్తమామలను వేడుకుంది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించు కూర్చుంది. తన భర్త బస్సు జశ్వంత్ రెడ్డిని తనకు అప్పగించాలని కన్నీరుమున్నీరు అయి విలపిస్తూ ఇంటి ఎదుట కూర్చుని ఉంది.

Next Story

Most Viewed