సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళ్లేలా చేస్తా : లింగాల రాజ‌బాబు గౌడ్

by Ratna Kumari |

అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని తాను నిలబెట్టుకునే విధంగా పని చేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ అన్నారు.

సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళ్లేలా చేస్తా : లింగాల రాజ‌బాబు గౌడ్
X

దిశ‌, బిక్క‌నూరు : అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని తాను నిలబెట్టుకునే విధంగా పని చేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన న్యాయవాది లింగాల రాజబాబు గౌడ్ కు చోటు కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో చొచ్చుకుపోయే విధంగా కృషి చేస్తానన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story