- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాచార బాధితురాలికి అండగా ఉంటాం : ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
దిశ, కామారెడ్డి : అత్యాచారానికి గురైన బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారానికి

దిశ, కామారెడ్డి : అత్యాచారానికి గురైన బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారానికి గురైన విషయం తెలుసుకున్న ఆయన శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో బాధిత మహిళను పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తో పాటు గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి నష్ట పరిహారం అందించడానికి గల మార్గాలను చూడాలని ఏ ఎస్పీ కి సూచించారు. బాధితురాలి పిల్లల చదువుకు అండగా నిలిచేలా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చాక చక్యంగా నిందితుడిని పట్టుకున్న జిల్లా పోలీసులను ఆయన అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీస్, సఖి సెంటర్ నిర్వాహకులు ఉన్నారు.






