బైక్ పై వెళ్తూ అలా చేశాడు..

by Disha Web Desk 20 |
బైక్ పై వెళ్తూ అలా చేశాడు..
X

దిశ, మాక్లుర్ : మాక్లుర్ మండలం గొట్టుముక్కుల గ్రామానికి చెందిన గాల్వె లక్ష్మి తన భర్త గంగాధర్ తో బైక్ పై నిజామాబాదు ఫంక్షన్ కు వెళ్తుండగా బొంకన్ పల్లి గ్రామ శివార్లో బండిపై వచ్చిన అపరిచితుడు మహిళ మేడలోంచి మూడు తులాల బంగారు గొలుసును దొంగిలించారు. మహిళ అరవడంతో గ్రామస్తులు దొంగలను వెంబడించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై యాదగిరిగౌడ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకొని, పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.

Next Story