చోరీ సొత్తు స్వాధీనం.. నిందితురాలుని రిమాండ్ కి తరలింపు

by Ratna Kumari |

చోరీ సొత్తు స్వాధీనం చేసుకొని నిందితురాలును రిమాండ్ కి త‌ర‌లించిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది.

చోరీ సొత్తు స్వాధీనం.. నిందితురాలుని రిమాండ్ కి తరలింపు
X

దిశ‌, నిజాంసాగ‌ర్ : చోరీ సొత్తు స్వాధీనం చేసుకొని నిందితురాలును రిమాండ్ కి త‌ర‌లించిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శివ‌కుమార్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌న‌వ‌రి 09న 1.3 తులాల బంగారు గుండ్లు, మూడు మాసాల మాటీలు, 15 తులాల వెండి వ‌స్తులు త‌న ఇంట్లో ఉన్న బీరువాలో దొంగిలించార‌ని మ‌ల్లూరు గ్రామానికి చెందిన పెద్ద‌రెడ్డి విజ‌య‌రావు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు మ‌ల్లూరు గ్రామానికి చెందిన జాంద‌రి సాయ‌వ్వ‌ను విచారించ‌గా.. దొంగిలించబ‌డిన వ‌స్తువులు ల‌భించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని బుధ‌వారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు ఎస్సై శివ‌కుమార్ తెలిపారు. పోలీస్ సిబ్బంది వెన్నెల‌, వ‌సీ, ప్ర‌వీణ్, సాయి పాల్గొన్నారు.

Next Story