- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు.

దిశ, సదాశివనగర్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు.
గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంతో పాటు, ప్రతి ఇంటికి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్లపై ఉందన్నారు. ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలపై రైతులకు ప్రోత్సాహం కల్పించి, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం మండల సమాఖ్య సభ్యురాలు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ అభివృద్ధిలో సంఘాల పాత్ర గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో మహిళలు ఆర్థికంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ చొరవతో త్వరలో మండలానికి RTC బస్సు రానున్నదని సంతోషం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గిరి, డీఆర్డీఓ సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, ఎంపీడీవో సంతోష్ కుమార్, తహశీల్దార్ ఆకుల సత్యనారాయణ, డీఎంహెచ్ఓ రవీందర్, ఎంపీడీవో సంతోష్ కుమార్, సదాశివ నగర్ సర్పంచ్ వంకాయల శిరీష రవి , ఐసిడిఎస్ సిడిపిఓ పద్మ, హౌసింగ్ ఏఈ సుచిత్ర విద్యుత్ ఏఈ గంగాధర్, ఉపాధి ఏపీఎం శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏవో ప్రజాపతి, ఏఈఓ కవిత, ధర్మరావుపేట సర్పంచ్ ఉమార్, అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్ ఎడ్ల నర్సింలు, యాచారం, పద్మాజి వాడి, తుక్కోజి వాడి, తిమ్మాజి వాడి, మర్కల్, తిర్మన్ పల్లి, యాచారం, ధర్మారావుపేట, అమర్ల బండ, మల్లుపేట, అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్, ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్ పాల్గొన్నారు.






