'అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపనతో నిజం కాబోతున్న కోట్లాది హిందువుల కల'

by Disha Web Desk 20 |
అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపనతో నిజం కాబోతున్న కోట్లాది హిందువుల కల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అయోధ్య రామమందిరంలో వచ్చేనెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాములవారిని ప్రతిష్టించే గర్భగుడి ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన నేపథ్యంలో కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు.

ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్ కు జత చేశారు. అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభసమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు.” అని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Next Story

Most Viewed