నిజామాబాద్ లోని జాడి జమాల్‌పూర్‌ ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉద్రిక్తత

by Muthe.Rajitha |

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం జాడి జమాల్‌పూర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నిజామాబాద్ లోని జాడి జమాల్‌పూర్‌ ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్, డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం జాడి జమాల్‌పూర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం జరిగిన పోలింగుకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఇరు వర్గాల అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక అభ్యర్థి మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య గొడవ జరిగి.. కొద్దిసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది.

Next Story