సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సభాపతి

by Dishanational1 |
సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సభాపతి
X

దిశ, బాన్సువాడ: బాన్సువాడ పట్టణం మరియు రూరల్ మండలాలలో శ్రీ రామ నవమి సందర్భంగా పలు ఆలయాలలో సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మండలంలోని పోచారం, దేశాయిపేట్, సోమేశ్వర్, తీర్మలాపుర్, బాన్సువాడ పట్టణంలోనీ శ్రీరామ కాలనీ, మార్కండేయ మందిరం దగ్గర ఉన్న ఆలయంలలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed