బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి

by Disha Web Desk 20 |
బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి
X

దిశ, బాన్సువాడ : రుద్రూరు మండల కేంద్ర శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రుద్రూర్ నుంచి బోధన్ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కోటగిరి మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన యువకుడు రాజుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story