పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. భారీగా నగదు స్వాధీనం

by Web Desk |
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. భారీగా నగదు స్వాధీనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలోని కమలానెహ్రు కాలనీలో పేకాట ఆడుతున్న ఇంటిపై నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. శుక్రవారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఓ ఇంటిపై దాడిచేశారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న కునింటి మహిపాల్ రెడ్డి, బత్తిని శ్రావణ్, జైడి రమేష్, రాజ్ కుమార్ అగర్వాల్, పిప్పెర అనిల్, ఏలేటి కిషన్, జోగినిపల్లి సుధీర్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వద్దనుంచి మూడు కార్లు, ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ.2,58,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి ఆర్మూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

Next Story

Most Viewed