నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

by Disha Web Desk 15 |
నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి
X

దిశ, కామారెడ్డి : నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాలతో వినోదం విషాదంగా మారకుండా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ కోరారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన నియమనిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడిపే వారిపై, బైకులపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ కేరింతలు కొడుతూ, బైకులను షేక్ డ్రైవింగ్ చేస్తూ, తోటి వారికి ఇబ్బంది కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 12 గంటల తరువాత రోడ్ల పై కేకులు కట్ చేసినా, డీజే లు పెట్టి డ్యాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించినా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రజల ఆస్తులని కానీ ధ్వంసం చేస్తే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు నష్టపరిహారం కట్టాల్సి ఉంటుందన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో అసభ్య సందేశాలు, అసభ్య ఫొటో లు, అసభ్య ఆడియోలు పంపినా సహించేది లేదన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12 గంటల తర్వాత వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో కుటుంబ సమేతంగా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఒక్క రోజు ఆనందానికి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దని కోరారు. వేడుకలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలందరూ సహకరించాలన్నారు.

Read More..

బాలికపై పినతండ్రి ప్రలోభాలు

Next Story