దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోడీ

by Disha Web Desk 15 |
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోడీ
X

దిశ,ఎల్లారెడ్డి : బీజేపీ కార్యకర్తలు కలిసి కట్టుగా ఆత్మవిశ్వాసంతో పని చేసి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండాను ఎగుర వేసేందుకు కంకణబద్దులు కావాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించారు. ఎల్లారెడ్డి, సదాశివానగర్, గాంధారి, లింగంపేట, తాడ్వాయిలో జరిగిన సమావేశాల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ.. దేశ ఖ్యాతి ని ప్రపంచ నలుమూలల చాటిన మోడీనే మరోసారి ప్రధాని అవుతున్నారని తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో మోడీ విశేషంగా కృషి చేసి విజయం సాధించారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ ప్రగతి పథంలో నడవాలంటే మోడీతోనే మనందరం పయనించాలని అన్నారు.

గత పదేళ్లలో జహీరాబాద్ నియోజకవర్గంను అభివృద్ది చేసేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ నిధులు తీసుకు వచ్చి నియోజకవర్గంను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రతీ బీజేపీ కార్యకర్త గ్రామీణ స్థాయి నుంచి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో రాణిస్తే తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ గడ్డ పై కాషాయం జెండాను ఎగరవేసి మోడీకి బహుమతి గా ఇద్దామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ రవి గౌడ్, ప్రభారీ మహిపాల్ రెడ్డి, బానల లక్ష్మా రెడ్డి, శుభాష్ రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, నియోజకవర్గం కన్వీనర్ లింగారావు, కో కన్వీనర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, మండలాల అధ్యక్షులు రాంరెడ్డి, నర్సింహులు, శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, మధు సుదన్ రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed