BREAKING: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
BREAKING: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లు గెలిచి తీరాల్సిందేనని ఇప్పటికే అన్ని పార్లమెంట్ స్థానాలకు మంత్రులు, ఇతర కీలక నేతలను ఇన్ చార్జ్‌లుగా నియమించిన కాంగ్రెస్.. తాజాగా ఐదు లోక్ సభ సెగ్మెంట్లకు కో-ఇన్‌చార్జ్‌లను నియమించింది. మహబూబ్ నగర్- జితేందర్ రెడ్డి, జహీరాబాద్-మదన్ మోహన్ రావు, మెదక్-జగ్గారెడ్డి, వరంగల్-శ్రీధర్ బాబు, చేవెళ్ల- రామ్మోహన్ రెడ్డిలను కో-ఇన్‌ఛార్జ్‌లుగా ఏఐసీసీ అపాయింట్ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మదన్ మోహన్ రావు, జితేందర్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

Next Story

Most Viewed