మైనర్ బాలిక అదృశ్యం..

by Disha Web Desk 20 |
మైనర్ బాలిక అదృశ్యం..
X

దిశ, రాజంపేట : మెదక్ జిల్లా హవెలిఘన్పూర్ మండలంలోని వాడి గ్రామపంచాయితీ పరిధిలోని దూప్ సింగ్ తండాకు చెందిన మైనర్ బాలిక దేవసోత్ కళ్యాణి (16) ఈ నెల 9 నుండి కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసునమోదు చేసినట్లు రాజంపేట ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సదరు బాలిక రాజంపేట మండలంలోని ఎల్లాపూర్ తాండలో టైలరింగ్ నేర్చుకునేదని అయితే ఈ నెల 9న గుండారం వెళ్తున్నానని చెప్పింది.

తండ్రి విచారించగా అక్కడికి రాలేదని తెలిసింది. బంధువుల ఇళ్లలో సైతం వెతికారని ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని ఎత్తు 5, 4 చామన చాయ రంగు గుండ్రని ముఖం కలదని, తెలుగు, లంబడి భాషలలో మాట్లాడుతుందని, ఇంటి నుండి వెళ్లేటప్పుడు బ్లూ కలర్ టాప్ ఎరుపు రంగు లెగ్గిన్ ధరించి ఉందని తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసునమోదు చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.



Next Story