చెట్టుకు పుట్టిన రోజు వేడుక.. కేక్ కట్ చేసిన మంత్రి వేముల..

by Disha Web Desk 20 |
చెట్టుకు పుట్టిన రోజు వేడుక.. కేక్ కట్ చేసిన మంత్రి వేముల..
X

దిశ, భీమ్‌గల్ : చెట్లను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు పుట్టినరోజు వేడుకలు చేసి కేట్ కట్ చేశారు. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో ఓ మొక్కను నాటారు. ఆ మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి వేముల కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత హారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం అని అన్నారు. ఇది ఓట్ల కోసం చేసేది కాదని భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని వెల్లడించారు. ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయి అని తెలిపారు. మొక్కలు సంరక్షించడం నాటడం మన అందరి బాధ్యత అని మంత్రి గుర్తుచేశారు. మొక్కలు నాటడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు.


Next Story

Most Viewed