గాడిద పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మ ఊరేగింపు

by Disha Web Desk 20 |
గాడిద పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మ ఊరేగింపు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన సందర్బంగా మునుగోడు నియోజకవర్గంలో చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీజేపీ నాయకులు నిప్పు పెట్టి దహనం చేయడాన్ని నిరశిస్తూ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గడుగు రోహిత్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం గాడిదపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను ఉంచి నిజామాబాద్ పట్టణంలో ఊరేగించి పులాంగ్ చౌరస్తాలో దహనం చేశారు.

ఈ సందర్భంగా కార్పోరేటర్ గడుగు రోహిత్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టికి కంచుకోట అక్కడ ఆపార్టీకి ఉన్న ఆదరణతో ఓడిపోతామని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టికి ద్రోహం చేయ్యడమే కాకుండా పీసీసీ చీప్ రెవంత్ రెడ్డి ప్రచారానికి రానుండగా పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తల జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో నవాజ్, మోహిన్, హర్షద్, జాకీర్, అశ్విన్, దిగంబర్, పవన్ జాదవ్, వాహిద్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed