ఎస్సారెస్పీ జలాశయంలో లభ్యమైన నాలుగో మృతదేహం

by Kodari Anjali |

ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన విషాద ఘటనలో గల్లంతైన వారిలో నాలుగో యువకుడి మృతదేహం లభ్యమైంది.

ఎస్సారెస్పీ జలాశయంలో లభ్యమైన నాలుగో మృతదేహం
X

దిశ, ముప్కాల్: సెలవు రోజు కావడంతో సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన విషాద ఘటనలో గల్లంతైన వారిలో నాలుగో యువకుడి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలను ఆదివారం వెలికితీయగా.. మరో యువకుడు అర్హన్ (22) మృతదేహం ఉదయం సోమవారం లభ్యమైంది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story