ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస‌పోవ‌ద్దు : ఆర్డీఓ ప్ర‌భాక‌ర్

by Ratna Kumari |

ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోసపోవద్దని ఎల్లారెడ్డి ఆర్డీఓ రొడ్డ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి అన్నారు.

ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస‌పోవ‌ద్దు :  ఆర్డీఓ  ప్ర‌భాక‌ర్
X

దిశ‌, ఎల్లారెడ్డి : ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోసపోవద్దని ఎల్లారెడ్డి ఆర్డీఓ రొడ్డ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించాలని ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో త‌హ‌శీల్దార్ ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై డిటి సురేష్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్లు తిరుపతి, గఫర్ దశరథం, చంద్రయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాగం శంకరయ్య, మంద గంగారెడ్డి, రవీందర్ రెడ్డి, ముప్పిడి హరి నారాయణ, కంచర్ల శ్రీనివాస్, సొసైటీ సీఈఓ విశ్వనాథం, సిబ్బంది శశికాంత్, నాయకులు విద్యాసాగర్, ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story