- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.
చెడు పై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయ దశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, దుర్గామాత కరుణాకటాక్షాలతో అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని అభిలషించారు.