వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దశాబ్ధి ఉత్సవాల డ్రామ : మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

by Disha Web Desk 1 |
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దశాబ్ధి ఉత్సవాల డ్రామ : మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
X

దిశ, నిజామాబాద్ సీటీ : ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాల డ్రామ ఆడుతున్నాడని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కాంగ్రెస్ భవన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి, సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాల డ్రామ ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ, అమరుల త్యాగా మూలంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన అన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు తెలంగాణ ఆత్మ గౌరవం కొరకు, నీళ్లు, నిధులు, నియామకాలు పైనే కొనసాగాయని తెలిపారు.

ఆంధ్ర పాలకులపై 60 ఏళ్ల అలుపెరగని పోరాటంతో ముందుకెళ్లిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, సోనియా గాంధీ గారి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువకులు, నిరుద్యోగులు, రైతులు, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలు మారకపోగా, ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితిని సీఎం కేసీఆర్ సృష్టించాడని తెలిపారు.

ఖచ్చితంగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకునే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహీర్ బిన్ హాందం, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రూరల్ ఇన్ చార్జి భూపతి రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్.ఎస్.యూ.ఐ ఆధ్యక్షుడు వేణు రాజ్, రాష్ట్ర ఎన్.ఎస్.యూ.ఐ ప్రధాన కార్యదర్శి విపూల్ గౌడ్, కార్పొరేటర్ రోహిత్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభుద్ బిన్ హాంధన్, పీసీసీ మెంబర్ ఈసా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, ఉష, మలైకా బేగం, అబ్దుల్ ఏజాజ్, వినయ్, సేవాదళ్ సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడే రామకృష్ణ, ముస్తాఫ, వినోద్, అశ్రఫ్, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story