విద్యుత్ వైర్లు తెగిపడి ఆవు, గేదె, కుక్కలు మృతి..

by Disha Web Desk 20 |
విద్యుత్ వైర్లు తెగిపడి ఆవు, గేదె, కుక్కలు మృతి..
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ వైర్లు తెగి పడిపోవడంతో ఒక జెర్సీ ఆవు, సంకరజాతి గేదె, రెండు కుక్కలు విద్యుత్ షాక్ కు గురి అయ్యి మృతి చెందాయి. బాధితులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

భారీ ఈదురుగాళ్లు వేయడంతో విద్యుత్ వైర్లు తెగిపడడంతో ఆవు, గేదె, రెండు కుక్కలు మృతి చెందాయని అన్నారు. జెర్సీ ఆవు, గేదెక్క విలువ దాదాపు రెండు లక్షల వరకు ఉంటుందని ఆవు, గేదె మృత్యువాత పాడను చూసి రైతన్న కన్నీటి పర్యంతమయ్యాడు. గ్రామస్తులు రైతన్నను ఆదుకోవాలని అన్నారు.



Next Story

Most Viewed