20 లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవనం నిర్మాణం...

by Disha Web Desk 20 |
20 లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవనం నిర్మాణం...
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలం మగ్దూంపూర్ గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ భూమిపూజ చేశారు. ఎన్ఆర్జీఎస్, నిధుల కింద భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు.

భవన నిర్మాణ పనులు ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, గాలిపూర్ సర్పంచ్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లింగాల రామచందర్, డైరెక్టర్ బషీర్, గంగారం పాల్గొన్నారు.

Next Story

Most Viewed