హిజ్రాలను గ్రామంలోకి అనుమ‌తించ‌వ‌ద్ద‌ని పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు

by Ratna Kumari |

హిజ్రాలను ధర్పల్లి గ్రామంలోకి అనుమతించవద్దని గ్రామ కమిటీ సభ్యులు సోమవారం పోలీసులకు వినతి పత్రం అందిoచారు.

హిజ్రాలను గ్రామంలోకి అనుమ‌తించ‌వ‌ద్ద‌ని పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు
X

దిశ, ధర్పల్లి : హిజ్రాలను ధర్పల్లి గ్రామంలోకి అనుమతించవద్దని గ్రామ కమిటీ సభ్యులు సోమవారం పోలీసులకు వినతి పత్రం అందిoచారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు కొమిరే గంగాధర్ ఆధ్వర్యంలో సభ్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి హిజ్రాలను రానివ్వదని వివరించారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఓ బాలుడిని కిడ్నాప్ నకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.

Next Story