దేమీలో చిరుత పంజా.. అటవీశాఖ అధికారుల గూరక!

by Ratna Kumari |

ఎర్రపహడ్, మోతె గ్రామ శివారుల్లో వరుసగా జరుగుతున్న చిరుత దాడుల ఘటనలు మరువకముందే తాజాగా దేమి గ్రామ శివారులో చిరుత పులి మరోసారి పంజా విసిరింది.

దేమీలో చిరుత పంజా.. అటవీశాఖ అధికారుల గూరక!
X

దిశ, తాడ్వాయి : ఎర్రపహడ్, మోతె గ్రామ శివారుల్లో వరుసగా జరుగుతున్న చిరుత దాడుల ఘటనలు మరువకముందే తాజాగా దేమి గ్రామ శివారులో చిరుత పులి మరోసారి పంజా విసిరింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఓ లేగదూడ ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. దేమి గ్రామానికి చెందిన రైతు గొల్ల సంజీవులుకు చెందిన లేగదూడపై సోమవారం రాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడు సంజీవులు తన పశువును కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు.

ప్రజల ప్రశ్న.. అధికారుల నిర్లక్ష్యం?

​గత కొద్ది రోజులుగా ఎర్రపహడ్, మోతె ప్రాంతాల్లో మూగజీవాలపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ, అటవీశాఖ అధికారులు కేవలం సమీక్షలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకోవడానికి ఇప్పటివరకు బోన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు?​వరుస దాడులు జరుగుతున్నా నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదు?​రైతుల ప్రాణాలు, పశువుల రక్షణకు గ్యారెంటీ ఏది?​అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story