జాతీయ జెండా దహనానికి యత్నం

by Disha Web Desk 1 |
జాతీయ జెండా దహనానికి యత్నం
X

అడ్డుకున్న స్థానిక యువకుడు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణ నడిబొడ్డున మధ్యాహ్నం ఓ వ్యక్తి జాతీయ జెండాను తగులబెట్టేందకు యత్నించిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాంధీ చౌక్ వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి జాతీయ జండాను కాల్చేందుకు యత్నించాడు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న కసాబ్ గల్లీకి చెందిన ప్రశాంత్ అడ్డుకున్నాడు. జాతీయ జెండాను తగులబెట్టడం చూసిన వారంతా ఆయనను ప్రశ్నిస్తున్నప్పటికీ వినకపోగా దేశ వ్యతిరేక నినాదాలు, ఐఎస్ఐ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి మతి స్థిమితం లేదని సమాచారం.

Next Story

Most Viewed