పేకాట స్థావ‌రాల‌పై దాడులు..ఏడుగురిపై కేసు నమోదు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నిజాంసాగ‌ర్ : పేకాట స్థావ‌రాలపై పోలీసులు దాడులు చేసిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం నిజాం సాగ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివ‌కుమార్ తెలిపిన

పేకాట స్థావ‌రాల‌పై దాడులు..ఏడుగురిపై కేసు నమోదు
X

దిశ‌, నిజాంసాగ‌ర్ : పేకాట స్థావ‌రాలపై పోలీసులు దాడులు చేసిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం నిజాం సాగ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివ‌కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిజాంసాగ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌హ‌మ్మ‌ద్ న‌గ‌ర్ మండ‌ల కేంద్రంలోని ఓ ఇంట్లో గుట్టు చ‌ప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారం మేరు దాడులు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రూ.41,410 న‌గ‌దు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడినేడుగురిప కేసు న‌మోదు చేశారు. యువ‌త ఇలాంటి ఆన్ లైన్ జూదం ఆడుతూ అత్యాశ‌కు పోయి జీవితాలు పాడుచేసుకోవ‌ద్ద‌ని సూచించారు ఎస్సై శివ‌కుమార్. అలాగే పేకాట‌, ఆన్ లైన్ మ‌ట్కా, జూదం వంటివి ఆడేవారి వివరాలు తెలిస్తే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు.

Next Story