ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం వ్యాన్.. ఒకరు మృతి..

by Disha Web Desk 20 |
ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం వ్యాన్.. ఒకరు మృతి..
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం ఇల్చిపూర్ శివారులోని 44వ నెంబర్ జాతీయ రహదారి పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. దీంతో డీసీఎం వ్యాన్ లో ప్రయాణిస్తున్న షబానా (36) అక్కడికక్కడే మృతి చెందగా జాఫర్ ఖాన్ (6) అనే బాలునికి తీవ్ర గాయాలయ్యాయి.

జాఫర్ ఖాన్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా నాగపూర్ నుంచి బెంగళూరు వైపు ఫర్నిచర్ లోడుతో డీసీఎం వ్యాన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని దేవనపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.



Next Story