పెద్ద ధన్వాడ ఘటనలో ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణ

by Naga Rani Yarlagadda |

పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కలు కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఢిల్లీ కార్యాలయంలో బుధవారం విచారణ జరిగింది.

పెద్ద ధన్వాడ ఘటనలో ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణ
X
  • ఢిల్లీ నుంచి వచ్చే ప్యానల్ సభ్యులతో 28న విచారణ
  • రైతుల సమక్షంలో విచారణ చెపట్టనున్న ఎన్‌హెచ్ఆర్‌సీ

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కలు కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఢిల్లీ కార్యాలయంలో బుధవారం విచారణ జరిగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్యానల్ బృందం రైతులపై జరిగిన దాడిపై జూలై 28వ తేదిన విచారణ చేపట్టనున్నట్లు ఫిర్యాదు దారు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు తెలిపారు. విచారణ బాధిత రైతుల సమక్షంలో బహిరంగంగా జరగాలని ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశాలిచ్చిందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారని ఎన్‌హెచ్ఆర్‌సీ ఫిర్యాదు చేశారు. రైతులకు బేడీలు వేసిన ఘటనపై కూడా ఎన్‌హెచ్ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story