పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతా.. కొత్త DGP శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతానని రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఎన్నికైన బత్తుల శివధర్ రెడ్డి అన్నారు.

పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతా.. కొత్త DGP శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతానని రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఎన్నికైన బత్తుల శివధర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియాను పూర్తిగా నిర్మూలించాల్సిందేనని అన్నారు. ప్రజలకు పోలీసింగ్‌పై నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానని.. పోలీసు వృతి అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. న్యాయవాద వృత్తిని వదిలి పట్టుదలతో సివిల్స్‌కు ప్రిపేర్ అయి ఐపీఎస్‌ సాధించానని తెలిపారు. మవోయిస్టుల వ్యవస్థ దాదాపు అంతమైనట్లేనని అన్నారు. గతంలో వివిధ జిల్లాల ఎస్పీగా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన అనుభవంతో తెలంగాణ తనకు పూర్తి పట్టు ఉందని డీజీపీ బత్తుల శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Next Story