- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కొత్త సీఎస్ రామకృష్ణా రావు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary Telangana Government)గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు (Rama Krishna Rao) నియమితులైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary Telangana Government)గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు (Rama Krishna Rao) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను (Deputy CM Mallu Bhatti Vikramarka)ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణా రావుకు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్కు బ్యాచ్చెందిన రామకృష్ణా రావు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ (Department of Finance) బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖలో చేసిన ఆయన సేవలను గుర్తించిన సర్కార్ అనుభవం దృష్ట్యా రామకృష్ణా రావును సీఎస్గా నియమించింది. గతంలో ఆయన నల్లగొండ (Nalgonda) జాయింట్కలెక్టర్గా, గుంటూరు (Guntur) జిల్లా కలెక్టర్గా కూడా పని చేశారు.






