‘కేసీఆర్ మీటింగ్‌కు పిలిచి గొడ్డుకారంతో భోజనం’ (వీడియో)

by Disha Web Desk 2 |
‘కేసీఆర్ మీటింగ్‌కు పిలిచి గొడ్డుకారంతో భోజనం’ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: గద్వాల పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు హాజరైన ప్రజలను ఆకలితో అలమటించేలా చేశారు బీఆర్ఎస్ నేతలు. సోమవారం గద్వాలలో నూతన కలెక్టర్, ఎస్పీ భవననం, పార్టీ ఆఫీసులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలో కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలను బీఆర్ఎస్ నాయకులు సభాస్థలికి తరలించారు. సభ అనంతరం హాజరైన వారికి గొడ్డు కారం అన్నం వడ్డించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. సీఎం సభకు పిలిపించి కారంప్పొడి అన్న పెడతారా అని నెటిజన్లు మండిపడుతున్నారు.

తమకు ఎలాంటి కూరలు ఇవ్వలేదని కేవలం కారప్పొడి అన్నం మాత్రమే వడ్డించారని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ వీడియోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లీనరీల్లో నాయకుల కోసం రుచికరమైన వంటలు వండించే బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ మీటింగ్ కు వచ్చే సామాన్య ప్రజలకు మాత్రం గొడ్డుకారం అన్నం తినిపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఈ వీడియోపై తీన్మార్ మల్లన్న సైతం రియాక్ట్ అయ్యారు. అటుకులు బుక్కిన దొర మీటింగ్ లో కారం మెతుకుల బువ్వ అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Next Story

Most Viewed