వందే భారత్ రైలుకు ఘనస్వాగతం

by Disha Web Desk 20 |
వందే భారత్ రైలుకు ఘనస్వాగతం
X

దిశ, చిట్యాల : సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళనున్న వందే భారత్ రైలు శనివారం ప్రారంభం కావడంతో చిట్యాల రైల్వే స్టేషన్ కు వచ్చింది. ఈ సందర్భంగా చిట్యాల పట్టణ ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో రైల్వే స్టేషన్ ను చేరుకొని జాతీయ జెండాలను చేతపట్టుకొని జాతీయ నినాదాలతో హోరెత్తించారు.

అంతేకాకుండా రైల్వే స్టేషన్ ఆవరణలో విద్యార్థులు భారతమాత వేషధారణ వేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వారంలో మంగళవారం మినహాయించి మిగిలిన ఆరు రోజులు సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లనున్న వందే భారత్ రైలు నల్గొండ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు ఉదయం 7:19 నిమిషాలకు రానున్నట్లు రైల్వే స్టేషన్ సూపరిండెంట్ నవీన్ కుమార్ తెలిపారు.



Next Story

Most Viewed