అప్పటి వరకూ వెంట తిరిగిన చిన్నారి అంతలోనే....

by Disha Web Desk 15 |
అప్పటి వరకూ వెంట తిరిగిన చిన్నారి అంతలోనే....
X

దిశ, నేరేడుచర్ల (చింతలపాలెం) : అప్పటి వరకు నాయనమ్మ వెంట తిరిగిన ఓ చిన్నారి అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయిన సంఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినే పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వజినేపల్లి గ్రామానికి చెందిన కందుకూరి విద్యాసాగర్, కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ చిన్న పిల్లలు కావడంతో పెద్దమ్మాయి స్పైసీని అదే గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలో చేర్పించారు. స్పైసీని తన నాయనమ్మ రాజ్యం అంగన్వాడి పాఠశాలకు పంపించే క్రమంలో తన వెంట చిన్న మనవరాలైన వాత్సల్య (2)ను తీసుకువెళ్లారు. అంగన్వాడి పాఠశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వాత్సల్య మధ్యలో ఆగిపోయింది. అది గమనించని వాళ్ల నాయనమ్మ అక్కడి నుంచి ఇంటికి వచ్చింది. కొంత సమయం తర్వాత తన వెంట వచ్చిన వాత్సల్య కనిపించకపోవడంతో ఆమె కోసం అంగన్వాడీ కేంద్రం సమీపంలో వెతకగా ఓ ఇంట్లోని నీటి సంపులో మునిగి ఉండడం గమనించారు. వెంటనే బయటకు తీసి పక్కనే ఉన్న ముత్యాల గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న డాక్టర్ కి చూపించగా అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దాంతో తల్లిదండ్రులు, బంధువుల రోధనలు మిన్నంటాయి.


Next Story

Most Viewed