మృతి చెందిన రైతు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహకారం..

by Kodari Anjali |

సీఎం సభకు వెళ్లి వస్తూ బస్సులో గుండెపోటుతో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆర్థిక సాయం అందించారు.

మృతి చెందిన రైతు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహకారం..
X

దిశ, చిట్యాల: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన పప్పుల ఎల్లయ్య శనివారం కోయడలో జరిగిన సీఎం సభకు వెళ్లి వస్తూ బస్సులో గుండెపోటుతో మృతి చెందడంతో ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం. ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల చెక్కును అందజేయడంతో పాటు తాను వ్యక్తిగతంగా 50 వేలు రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Next Story