మొరిపిరాల ఆత్మహత్య కేసులో ఏడుగురు రిమాండ్

by Bhanu |   (  Updated:2025-05-22 11:54:30  IST  )

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామంలో సంభవించిన విషాద ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు.

మొరిపిరాల ఆత్మహత్య కేసులో ఏడుగురు రిమాండ్
X

దిశ, ఆత్మకూరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామంలో సంభవించిన విషాద ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 18న మొరిపిరాల గ్రామానికి చెందిన యువతి కటిక సంధ్య మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపగా, కేసును విచారించిన పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం స్థానిక మీడియాతో మాట్లాడిన ఏసీపీ పి. మధు సూదన్ రెడ్డి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సంధ్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను గుర్తించి, విచారణ అనంతరం వారిని న్యాయస్థానానికి హాజరుపర్చి రిమాండ్‌కు పంపించినట్టు తెలిపారు. రిమాండ్ చేసిన వారిలో సంధ్య భర్త కటిక కృష్ణ, తల్లి మారెమ్మ, తండ్రి రాములుతో పాటు శివగణేశ్, శ్రీను, రమ్య, వాణి ఉన్నట్లు చెప్పారు.

Next Story