సర్పంచ్ అన్నెం శిరీషకు సేవానందిని పురస్కారం

by Disha Web |
సర్పంచ్ అన్నెం శిరీషకు సేవానందిని పురస్కారం
X

దిశ,హుజూర్‌నగర్ రూరల్ : మండలం లోని వేపలసింగారం సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి మహిళా విశిష్టకీర్తి పురస్కారంలో భాగంగా సేవానందిని అవార్డును అందుకున్నారు.సోమవారం రాత్రి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహిళా విశిష్ట పురస్కారం 2023వ సంవత్సరం సేవనందిని అవార్డును రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకులాపురం కృష్ణమోహన్,సీనినటి మంజూభార్గవి చేతులు మీదుగా ఆమె అందుకున్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు కరోన కాలంలో 60 రోజులపాటు గ్రామస్థుల సహాకారంతో నిరుపేద కుటుంబాలకు ఉచిత అన్నదానం,నిత్యావసర సరుకులు పంపిణి చేసిన సందర్భంగా సేవ నందిని అవార్డును అందజేసినట్టు ఆమెతెలిపారు.కార్యక్రమంలో తార అకాడమీ సంస్థ చైర్మన్ సంకెరాజేష్, సినీటెలివిజన్ ప్రముఖులు రోజారమణి,వైవిజయ,దివ్యవాణి,ప్రీతినిగమ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story