జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

by Disha Web Desk 13 |
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
X

దిశ, చిట్యాల: చిట్యాల మండలంలోని వెలిమినేడు లో జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కట్టెల లోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ మచ్చ వెంకటయ్య (45) ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు వ్యక్తులకు గాయపడ్డారు.


దీంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతుడు యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలం, కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, కట్టెలు పడడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.



Next Story

Most Viewed