ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతమైన జీవితం: మంత్రి జగదీష్ రెడ్డి

by Disha Web Desk 11 |
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతమైన జీవితం: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, మోత్కూరు: ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర విద్యుత్ శక్తి శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం మోత్కూరు మున్సిపాలిటీ పదవ వార్డు పరిధిలోని ధర్మాపురంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సహిత గణపతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.

భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని జరుపుకుంటున్న ధర్మపురం గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తీపి రెడ్డి మేఘారెడ్డి బీఆర్ఎస్ మండల, పట్టణ శాఖ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ చక్రవర్తి, గజ్జి మల్లేష్, కొండ సోంమల్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story