పండుగ రోజు తల్లిదండ్రులు గొడవ పడ్డారని కుమారుడు దుశ్చర్య

by Disha Web |
పండుగ రోజు తల్లిదండ్రులు గొడవ పడ్డారని కుమారుడు దుశ్చర్య
X

దిశ,పి.ఏ.పల్లి : పి.ఏ.పల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన కుంటిగొర్ల వెంకటయ్య,పద్మ దంపతులు తమకున్న సొంత పొలం 6ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నారు.నిన్న రాత్రి వేరుశనగ పంటకు స్పింకర్ల పైపుల ద్వారా నీళ్లు కట్టగా,కొన్ని పైపులు మార్చలేదని ఇంటి దగ్గర భార్య భర్త ఇద్దరూ బాగా వాదన చేసుకోని రోజు గొడవపడుతున్నారు.వారి చిన్న కుమారుడు కుంటిగొర్ల హరీష్ 18సంవత్సరాలు ఇంటర్ రెండవ సంవత్సరం దుగ్యాల యందు గల మోడల్ స్కూల్ నందు చదువుచున్నాడు.ఇంటి వద్ద నాన్న ఎప్పుడు అమ్మతో గొడవ పడుతుండాటాన్ని,పండుగ రోజు కూడా గొడవ పడుతుండడంతో సున్నితమైన మనస్సుతో మనస్తాపం చెంది ఇంటి నుండి బయటకు వెళ్లి తన నల్లగొండ లో చదువుచున్న తన అన్న అనిల్ కు ఫోన్ చేసి ఇంటి వద్ద ఉండాలని అనిపించడంలేదని చెప్పి రాత్రి 10గంటలకు గ్రామ శివారు లో గల మిషన్ భగీరథ ట్యాంక్ పై నుండి దూకడంతో తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. పిర్యాదుదారునికి ఇద్దరు కుమారుల సంతానం.తండ్రి వెంకటయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి ఎస్.ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed